విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమాచార కమీనర్ శామ్యుల్ జొనాధన్ యుఎస్ కాన్సులెట్ జనరల్ హైదరాబాదు లోని ఆర్థిక, రాజకీయ విభాగ అధ్యక్షుడు ఫ్రాంక్ పి టల్లుటో మరియు రాజకీయ ఆర్థిక నిపుణుడైన సిబా ప్రసాద త్రిపాఠి, మరియు కర్రి శ్రీమాలి ని విజయవాడ లో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వారు భారతదేశ అమెరికా మద్య గల స్నేహపూర్వమైన బంధాన్ని గర్తుచేసుకుంటూ ఈ రెండు అతిపెద్ద దేశాలలో ప్రజాస్వామ్య మనుగడ గత కొన్ని ఏళ్ళనుండి కొనసాగుతుందని, ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా భారతదేశ ప్రజలు తమయొక్క విలక్షణమైన తీర్పునిచ్చి కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో దోహదపడ్డారన్నారు. ముఖ్యంగా విభజిత ఆంద్రప్రదేశ్ మానవ వనరులు, సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రదేశం అని, ఈ ప్రదేశం యొక్క చారిత్రాత్మక, భౌగోళికమైన అంశాలను గుర్తుంచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి అమెరికా దేశం నుండి పరస్పర సహకారం తోడ్పాటు అవసరం అని వారు అమెరికా దౌత్యవేత్తలను ఈ సందర్భంగా అభ్యర్థించారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …