విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో గురువారం పండుగ వాతావరణం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం 90% శాతం పైగా పూర్తి చేశామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. సచివాలయల సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు, ఎన్డీయే కూటమి నాయకుల, సమన్వయంతో, పశ్చిమ లో ఉదయం ఆరు గంటలకె పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ సక్రమంగా సజావుగా జరిగిందని వృద్ధులకు రూ 4000 వేలు దివ్యాంగులకు రూ 6 వేలు అందజేశామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారని తెలిపారు. అనివార్య కారణాలవలన ఎవరికైనా పింఛన్ అందకపోతే వారికి సచివాలయ కార్యదర్శులు మరుసటి రోజు పంపిణీ చేస్తారని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …