విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్, రెండో అంతస్తులో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి కలెక్టర్ల సదస్సులో పాలనలో బాధ్యత, జవాబుదారీతనంపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం చేశారు. అదే విధంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై సూచనలు చేశారు. 100 రోజుల ప్రణాళిక, “పేదల సేవలో” కార్యక్రమం, జీరో పావర్టీ, ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ తదితరాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశనం చేశారు. అదే విధంగా రాష్ట ప్రగతికి సమష్టిగా పనిచేద్దామంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సదస్సులో పేర్కొన్నారు
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …