Breaking News

ఆక్వా ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా కల్చర్ లో ఆధునిక, సాంకేతిక, అంతర్జాతీయ పద్ధతులు అవలంబించడం ద్వారా ఆక్వా ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించాలని, భావితరాలకు ఆక్వా మెరైన్ ఫిషింగ్ అందించాలని, అందుకోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, తీర ప్రాంత రక్షణ గోడగా నిలిచే మడ అడవులను పరిరక్షించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. Food and agriculture organisation of the United Nations(FAO) ఆధ్వర్యంలో GEF8 project on sustainable aquaculture in AP ప్రాజెక్టు అమలులో భాగంగా ఆదివారం ఈ ప్రాజెక్టు బృందం స్థానిక గిలకలదిండిలో ఫిషింగ్ హార్బర్ సందర్శించి ఇక్కడి వాతావరణ పరిస్థితులు పరిశీలించి స్థానిక ఆక్వా సాగు దారులతో మాట్లాడి ఇక్కడ ఆక్వా సాగు ఎదుర్కొంటున్న సమస్యలు, అనుకూల అంశాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి బృంద సభ్యులతో మాట్లాడుతూ సముద్ర చేపల్లో అంతరించిపోతున్న అరుదైన విలువైన జాతులను గుర్తించి పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భావితరాలకు మెరైన్ ఫిషింగ్ ఆక్వా ఫిషింగ్ అందించాలంటే ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులు పూర్తయితే, మచిలీపట్నం ఆక్వా హబ్ కేంద్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా తీర ప్రాంత రక్షణ గోడ అడవులను పరిరక్షించాలని, సముద్ర జాతుల్లో చాలా రకాలైన బ్రీడ్స్ పునరుత్పత్తికి మడ అడవులు దోహదం చేస్తాయని అన్నారు.

మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోనికి వెళ్లి కొన్ని దినాలు ఫిషింగ్ చేసి పట్టిన చేపలు బయటకు వచ్చేదాకా నిల్వ చేయడంలో నష్టాలు, రవాణాలో నష్టాలతో మత్స్యకారులు నష్టపోతున్నారని అన్నారు. ఈ సమస్యలు అధిగమించడానికి “మదర్ షిప్” కాన్సెప్ట్ అమల్లోకి తేవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చన్నారు. ఆధునిక సోలార్ బోట్స్ అందుబాటులోకి తేవాలన్నారు. మంత్రిగా కాదు ఆక్వా సాగుదారుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు. తొలుత బృంద సభ్యులు తమ ప్రాజెక్టు గురించి వివరిస్తూ మంచినీరు మరియు తీరప్రాంతంపై ప్రభావం చూపే భూ-ఆధారిత పద్ధతులతో స్పష్టంగా ముడిపడి ఉన్న స్థిరమైన ఆక్వాకల్చర్ నిర్వహణలో పెట్టుబడిని విస్తరించడంతో పాటు సముద్ర పర్యావరణ వ్యవస్థలు గురించి వివరించారు. 1950ల నుండి ఆక్వాకల్చర్ సబ్ సెక్టార్‌లో గణనీయమైన వార్షిక వృద్ధి రేటు సాధించిందన్నారు. 2020లో భారతదేశ మొత్తం చేపల ఉత్పత్తిలో ఆక్వాకల్చర్ 68% దోహదపడిందని 28 మిలియన్ల మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులు ఫిషింగ్ మరియు ఆక్వాకల్చర్‌లో నిమగ్నమై ఉన్నారని,

అయితే, జల వ్యవస్థ సాంకేతిక, సామాజిక-ఆర్థిక పర్యావరణ మరియు ఆరోగ్య దృక్కోణంలో స్థిరంగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారుగా ఉందని, మరియు దీనిని “ఆక్వాకల్చర్ హబ్”గా పిలుస్తారన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వాకల్చర్‌పై దృష్టి పెడుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ బాధ్యతాయుతమైన మరియు స్థిరమైన ఆక్వాకల్చర్ ఉత్పత్తిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందని, ఇది వాతావరణాన్ని తట్టుకోగలదు మరియు ఇది ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం అంతటా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. మెరుగైన మరియు సైన్స్-ఆధారిత ఆక్వాకల్చర్ నిర్వహణ పద్ధతులు ఇంటిగ్రేటెడ్ ల్యాండ్‌స్కేప్ విధానాలు అవలంబించాలని, రసాయన వినియోగం తగ్గించి స్థిరమైన, వాతావరణ స్థితిస్థాపకత మరియు తగ్గిన పాదముద్ర ఆక్వాకల్చర్ కోసం పటిష్టమైన ఆహార వ్యవస్థ పాలన, ఆక్వాకల్చర్ విలువ గొలుసు వ్యాపారాలు మరియు ఇన్‌పుట్ సిస్టమ్‌ల కోసం ప్రోత్సాహకాల స్కేలింగ్ మరియు ఫైనాన్సింగ్ ద్వారా పర్యావరణ ప్రయోజనాలు పొందబడతాయని, స్థిరమైన ఆక్వాకల్చర్ ఉత్పత్తి వ్యవస్థల నిర్వహణ కోసం మెరుగైన సామర్థ్యం కలిగి ఉండాలన్నారు.

1)Food and agriculture organisation of the United Nations(FAO) ఆధ్వర్యంలో GEF8 project on sustainable aquaculture in AP ప్రాజెక్టుకు సంబంధించి ఇండియా సహాయ ప్రతినిధి డాక్టర్ కొండ చెవ్వ,
2) బయో డైవర్సిటీ ఎక్స్పర్ట్ మరియు FAO ప్రాజెక్ట్ జాతీయ కోఆర్డినేటర్ సీమ భట్,
3) లీడ్ టెక్నికల్ స్పెషలిస్ట్ మురళీధరన్ C M,
4) ఆక్వా కల్చర్ స్పెషలిస్ట్ విష్ణుభట్,
5) private sector, value chain and sustainable finance specialist నీలకంఠ మిశ్రా,
6) ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ నీనా కోషి,
7) gender, stakeholder engagement and safeguards specialist సలోమ్ ఏసుదాస్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.

అనంతరం ఈ బృందం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో సమావేశమై వారు పరిశీలించిన అంశాలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారికి జిల్లాలో ఆక్వాకల్చర్ పరిస్థితులు వివరించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్య శాఖ కమిషర్ తమ్ము డోలా శంకర్, అదనపు డైరక్టర్ డా.అంజలి, మత్య శాఖ జేడీ ఏ.చంద్రశేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి కే.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *