రేణిగుంట, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు పంచాయితీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రికి జెసి శుభం బన్సల్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆర్డీఓ లు నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో షార్ నందు కార్యక్రమంలో పాల్గొనుటకు 10.30 గం.లకు బయల్దేరి వెళ్లారు.
Tags tirupathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …