Breaking News

వరద నీరు ప్రవాహం సజావుగా సాగేలా చూడాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
లజ్జబండ మురికి కాలువలో పూడిక తీత పనులు వెంటనే పూర్తిచేసి వరద నీరు ప్రవాహం సజావుగా సాగేలా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం పెడన మండలంలోని లజ్జబండ మురికి కాలువలో 7 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న పూడిక తీత పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొంకిపూడి లోని లజ్జబండ మురికి కాలువ 15 వ కిలోమీటర్ల వద్ద పంటు మీద ప్రోక్లైనరుతో జరుగుతున్న పూడికతీత పనులను కలెక్టర్ పరిశీలించారు. రేఖా చిత్రం పరిశీలించి లజ్జబండ మురికి కాలువలో పూడిక తీత పనుల వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూడిక తీత లెవలింగ్ పరికరాలను కూడా స్వయంగా పరిశీలించి ఎలా నీటి లోతు వివరాలను చూస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందమూరు లోని లజ్జబండ మురికి కాలువ 7 వ కిలోమీటర్ వద్ద ఇదివరకే జరిగిన పూడిక తీత పనులను కలెక్టర్ పరిశీలించారు. కాలువ గట్టు పైన వేసిన పూడికను గమనించారు. అక్కడ ఉన్న పూడికను బయటికి తోడే రెండు డ్రెడ్జర్ వాహనాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డ్రైనేజీ ఈ ఈ విజయలక్ష్మి, డిఈ ఈ మురళి పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *