-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం లాగా ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నరని, ప్రజలు ఉదయం పదిగంటల నుండి తమ ఫిర్యాదులను అందజేయొచ్చని ఈ ప్రకటనలో కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.