Breaking News

త్రాగునీటి సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర శివారు ప్రాంతాల ప్రజలకు కూడా తగిన త్రాగునీటి సరఫరా చేసేలా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం కమిషనర్ స్వర్ణభారతి నగర్ లోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకి సంబందించి ప్రజల నుండి పలు ఫిర్యాదులు అందుతున్నాయని, ఆయా ప్రాంతాలకు త్రాగునీటిని అందించేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రధాన పైప్ లైన్లపై ఉన్న లీకులను వెంటనే మరమత్తు చేసి, పూర్తి స్థాయిలో సరఫరా జరిగేలా చూడాలని, రిజర్వాయర్ పరిధిలో త్రాగునీటి సరఫరా భాద్యత ఏఈదే నన్నారు. త్రాగునీటి సరఫరా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సమయం, మరి కొన్ని ప్రాంతాలకు అతి తక్కువ సమయం జరుగుతుందని, సరఫరా సమయాన్ని ఆయా ప్రాంతాలకు నివాసాలు, జనాభా మేరకు రేషనలైజేషన్ చేయాలన్నారు. అనంతరం పారిశుధ్య పనులు పరిశీలించి, ప్రతి ఇంటి నుండి నిర్దేశిత సమయంలో చెత్త సేకరణ జరగాలని, రోడ్ల, మీద కాల్వల్లో వ్యర్దాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి చుట్టుపక్కల నివాసితులు ఇబ్బందులు పడుతున్నారని, రెవెన్యూ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకొని సదరు స్థల యజమానులను గుర్తించి, శుభ్రం చేసుకోవాలని లేకుంటే చట్టపరంగా అపరాధ రుసుం విధిస్తామని తెలియచేయాలని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న ఇళ్లకు నూరు శాతం ఆస్తి పన్ను విధించాలని, ఎక్కడైనా ఇప్పటికీ ఆస్తి పన్ను విధించకుంటే వెంటనే చేపట్టాలన్నారు. రోడ్ల మార్జిన్లు, డ్రైన్ లు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారని, దీని వలన ట్రాఫిక్ సమస్యతోపాటుగా డ్రైన్లలో పూడిక తీయడానికి వీలులేక చిన్నపాటి వర్షాలకు కూడా డ్రైన్లు పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక, ప్రజరోగ్య అధికారులను ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ బి.స్మిత పద్మజ, డిఈఈ హనీఫ్, ఏఈ అనూష, శానిటరీ సూపర్వైజర్ సోమ శేఖర్, ఇన్స్పెక్టర్ డేవిడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *