గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు స్వచ్చమైన త్రాగునీరు అందించడంలో ఎక్కడా రాజీలేదని, త్రాగునీటి సరఫరాపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ గారు హెడ్ వాటర్ వర్క్స్ ని పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత హెడ్ వాటర్ వర్క్స్ కి ప్రకాశం బ్యారేజ్ నుండి ప్రతి రోజు ఎంత ముడి నీరు వస్తుంది, దాని ట్రీట్మెంట్, సరఫరా, క్లోరినేషన్, ఆలం మిక్సింగ్, నీటి శ్యాంపిల్స్ పరీక్షలు తదితర అంశాలు అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ నగర ప్రజలకు స్వచ్చమైన త్రాగునీటిని అందించడంలో రాజీపడ కూడదన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ లో సిబ్బంది అంకిత భావంతో పని చేయాలని, ముడినీటిని ట్రీట్మెంట్ చేసేప్పుడు ఆలం, క్లోరినేషన్ పక్కాగా నిర్దేశిత ప్రమాణంలో ఉండేలా చూడాలన్నారు. ల్యాబ్ లో ఎప్పటికప్పుడు శ్యాంపిల్స్ పరిశీలించాలని, శ్యాంపిల్స్ రిపోర్ట్ నిర్దేశిత రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.
అనంతరం బాలాజీ నగర్ లోని మొండి గేటు దగ్గర డ్రైన్ రైల్వే క్రాసింగ్ ని పరిశీలించి, మొండి గేటు దగ్గర రైల్వే ట్రాక్ కింద డ్రైన్ చాలా తక్కువ వెంట్ ఉండడంవలన డ్రైన్ దగ్గర మురుగు నీరు నిలిచి సమస్యగా ఉందన్నారు. రైల్వే శాఖతో సమన్వయం చేసుకొని సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఈఈ శ్రీనివాస్, డిఈఈ శ్రీధర్, ఏఈలు బాబర్, సునీల్ కుమార్, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …