అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటీష్ కాలపు రాచరికపు పోకడలకు స్వస్తి పలకనున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ , స్టాంపులు, రిజిస్టషన్ల శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు సిద్దం చేసారు. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఉండేలా చర్యలు ప్రారంభించారు. సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్య అధికారులే అన్న భావన కలిగేలా రెవెన్యూ శాఖలో మార్పులకు బీజం పడింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే స్టాంపులు, రిజిస్టషన్ల శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా తదనుగుణ సర్కులర్ జారీ చేయనున్నారు.
Tags amaravathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …