Breaking News

జిల్లాలో 2,67,089 మంది లబ్దిదారులకు సుమారు రూ.113.01 కోట్లు పంపిణీకి చర్యలు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-సెప్టెంబర్ నెల పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు ఒక రోజు ముందుగానే సచివాలయ సిబ్బంది ద్వారా నేడు ఆగస్ట్31న లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ
-ఆగస్ట్31న (నేటి)ఉదయం 6గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
NTR భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయాల్సినవి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల ఆగస్ట్ 31ననే (నేడే) జిల్లాలో 2,67,089 మంది లబ్దిదారులకు సుమారు రూ.113.01 కోట్లు పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి చేయనున్నట్లు తెలుపుతూ పెన్షన్ల పంపిణీ ఉదయం 6గం. ల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని, ఆలస్యం అయితే తప్పకుండా చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో 2,67,089 మంది లబ్దిదారులకు సుమారు రూ.113.01 కోట్లు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం వృద్దాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, HIV వ్యాధి గ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు రూ.3,000/- ల నుండి రూ.4,000/- వరకు పెంచడమైనదని, అలాగే వికలాంగుల పెన్షన్ లు రూ.3,000/- ల నుండి రూ.6,000/- వరకు పెంచడమైనదని, DMHO పెన్షన్ లు రూ.5,000/- ల నుండి రూ.10,000/- వరకు పెంచడమైనదని, ఇందులో శాశ్వత వికలాంగులకు రూ.5,000/- ల నుండి రూ.15,000/- వరకు పెంచడమైనదని తెలిపారు. సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం ఉన్నందున గౌ. ముఖ్యమంత్రి గారు సదరు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒక రోజు ముందుగానే సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఆగస్ట్ నెల 31ననే (నేటి శనివారం) పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆగస్ట్ 31న (నేటి శనివారం) ఉదయం 6గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని, ఒక్క నిమిషం లేట్ అయిన ఉపేక్షించేది లేదని, వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. ఏదేని కారణంగా మిగిలిపోయిన వారికి సెప్టెంబర్ 2వ తేదీన మాత్రమే పంపిణి చేయాలని తెలిపారు. పెన్షన్ లబ్ధిదారులు అందరూ ఆగష్టు 31న (నేడే) పెన్షన్ తీసుకోనవలెనని, బయట గ్రామాలకు వెళ్ళినవారు కూడా వారి గ్రామాలలో అందుబాటులో వుండి పెన్షన్ తీసుకొనవలెనని సంబంధిత మండల, సచివాలయం అధికారులు వారికి సమాచారం అందించి అందరూ వచ్చేలా వారికి సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్ లబ్దిదారులు ఎవ్వరు సచివాలయ కార్యాలయానికి రావలసిన అవసరం లేదు అని తిరుపతి జిల్లా కలెక్టర్ వారు తెలిపారు.

సంబంధిత ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్లు సదరు పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేసేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *