విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయ కక్ష లకు అతీతంగా పాలకులు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ కోరారు. శుక్రవారం ఊర్మిళా నగర్ లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన కళ్ళకు గంతలతో నిరాహార దీక్ష చేశా రు. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన జనవరి 30వ తేదీని జ్ఞాపకం చేస్తూ ప్రతినెలా 30వ తేదిన తాను కళ్ళకు గంతలతో నిరసన తెలియ జేస్తూ వస్తున్నానని చెప్పారు. గాంధీజీ ఆశించిన సురాజ్యం దిశగా పాలకులు పరిపాలన చేయాలని కోరారు. నేటి పాలకులు ప్రతి పక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేలా చూడడం సరికాదని, రాజ్యాంగ బద్ధంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పరి పాలన చేయా లనీ చెప్పారు. అధికారాన్ని కక్ష సాధింపులకు వాడే విధానాన్ని ప్రభుత్వాలు విడనాడాలని గాంధీ నాగరాజన్ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు తదితర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాది గ్రస్తులు ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని, కిడ్నీ వ్యాధి సమ స్యలకు తగిన పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. వీధికొక్క గాంధీ తయారైతేనే గాని భారతదేశం మళ్ళీ ప్రజా స్వామ్య యుతంగా తయారు కాగలదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మహిళా అధ్యక్షురాలు ఆర్.ఎన్.శివరంజని, ట్రస్ట్ ఏపీ బాధ్యురాలు బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …