-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా . ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, దేవేంద్ర రెడ్డి, నరసింహులు తో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు
రెవెన్యూ శాఖ –146, పంచాయతీ రాజ్ -22, పోలీస్ శాఖ- 13, నీటిపారుదల శాఖ – 2, ఏ.పి.ఎస్.డబ్ల్యు.ఆర్.ఈ.ఐ.ఎస్ -1, సర్వే -8, మెడికల్ -6, ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ -1, ఎం.ఏ.యు.డి -6,ఆర్&బి -1, ప్రొహిబిషన్& ఎక్సైజ్-1, డ్వామా -1, పర్యాటక శాఖ -1, ఐ.సి.డి.ఎస్ -1, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి -1, విద్యా శాఖ -1, ఎంప్లాయిమెంట్ -1, టి.టి.డి -1, దేవాదాయ శాఖ -2, అటవీ శాఖ -1, నేషనల్ హై వె-1, మైనారిటీస్ -1 వెరసి మొత్తం 219 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.