Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయం లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా . ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, దేవేంద్ర రెడ్డి, నరసింహులు తో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు
రెవెన్యూ శాఖ –146, పంచాయతీ రాజ్ -22, పోలీస్ శాఖ- 13, నీటిపారుదల శాఖ – 2, ఏ.పి.ఎస్.డబ్ల్యు.ఆర్.ఈ.ఐ.ఎస్ -1, సర్వే -8, మెడికల్ -6, ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ -1, ఎం.ఏ.యు.డి -6,ఆర్&బి -1, ప్రొహిబిషన్& ఎక్సైజ్-1, డ్వామా -1, పర్యాటక శాఖ -1, ఐ.సి.డి.ఎస్ -1, ఏ.పి.ఎస్.ఆర్.టి.సి -1, విద్యా శాఖ -1, ఎంప్లాయిమెంట్ -1, టి.టి.డి -1, దేవాదాయ శాఖ -2, అటవీ శాఖ -1, నేషనల్ హై వె-1, మైనారిటీస్ -1 వెరసి మొత్తం 219 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *