Breaking News

పిల్లలకు బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలి…

-పిల్లలు మెచ్చి ఇష్టంగా తినేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం రుచికరంగా ఉండేలా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ పాటిస్తూ పౌష్టికాహారం నాణ్యతగా శుచిగా అందించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలు మెచ్చి ఇష్టంగా తినేలా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం రుచికరంగా, శుచిగా ఉండేలా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ ఉండేలా బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు కలెక్టర్ గారు జిల్లాలోని పలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం తయారు చేసే వంట ఏజెన్సీలు, కుక్స్, అక్షయ పాత్ర, ఇస్కాన్, విద్యా శాఖ అధికారులు, ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ లు కొంతమందితో కలిసి వర్క్ షాప్ నిర్వహించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలులో భాగంగా పిల్లలు మెచ్చి ఇష్ట పడి తినేలా వారికి ఎంతో రుచికరంగా బలవర్ధకమైన ఆహారాన్ని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందించాలని సూచించారు. స్థానికంగా సీజనల్ గా అందుబాటులో ఉండే కూరగాయలతో, ఆకు కూరలతో పిల్లలు ఇష్టపడి తినేటువంటి ప్రభుత్వ నిర్దేశిత మెనూ మేరకు వంటకాలు చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రభుత్వం నుండి పోషకాలు ఉన్న ఫోర్టిఫైడ్ రైస్ అందజేస్తున్నారు అని తెలిపారు. అక్షయ పాత్ర, ఇస్కాన్, పలువురు ఏజెన్సీలు, అధికారులు వర్క్ షాప్ లో పలు సూచనలు చేయగా వాటిని నోట్ చేసుకుని ప్రభుత్వానికి పరిశీలన కొరకు నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి డా.వి.శేఖర్, ఉప విద్యా శాఖ అధికారులు, అక్షయ పాత్ర ప్రతినిధులు, ఇస్కాన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *