-ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ నందు పాస్ అయిన విద్యార్థులకు పరిశ్రమల యందు అప్రెంటిస్ శిక్షణ కొరకు అప్రెంటిస్ షిప్ మేళా సద్వినియోగం చేసుకోండి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ నందు పాస్ అయిన విద్యార్థుల కొరకు తిరుపతి జిల్లా ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందిన పరిశ్రమల యందు అప్రెంటిస్ కల్పించబడునని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఇచ్చిన స్కిల్ ఇండియా మేకిన్ ఇండియా పిలుపు మేరకు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రర్ప్రెన్యూర్ షిప్ వారి ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ప్రభుత్వ ఐ.టి.ఐ తిరుపతి నందు తేది. 11-09-2024న ఉదయం 10.00 గంటలకు జరుగును. కావున అప్రెంటీస్ షిప్ గురించి అవగాహన కొరకు వివిధ రకములైన కంపెనీలు ఆధ్వర్యంలో నిర్వహించబడును. కావున ఈ సదవకాశాన్ని ప్రతి ఐ.టి.ఐ విద్యార్థి/విద్యార్థినిలు ఉపయోగించుకోవలసినదిగా ప్రభుత్వ ఐ.టి.ఐ తిరుపతి ప్రిన్సిపాల్/కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా మరింత సమాచారం మరియు వివరాల కొరకు సి. గంగాధరం అప్రెంటీస్ షిప్ అడ్వైసర్ (9441647174, 9533717170) వారిని సంప్రదించవలసినదిగా కోరారు.