Breaking News

గుంటూరు నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రధానంగా విలీన గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రతిపాదనలు సిద్దం చేస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం స్థానిక బుడంపాడులోని పలు ప్రాంతాలను, రిజర్వాయర్ ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రతిపాదనలు సిద్దం చేస్తామన్నారు. బుడంపాడు చెరువు వైపు నివాసాలకు వెళ్లే రోడ్ వర్షాలకు దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్న స్థానికుల అభ్యర్ధన మేరకు తక్షణం ప్యాచ్ వర్క్ చేపట్టాలని, అవసరం ఉన్న ప్రాంతంలో కల్వర్ట్ నిర్మాణంకు అంచనాలు వేసి తమకు పంపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ లో మోటర్లు సరిగా పని చేయకపోవడం వలన పూర్తి స్థాయిలో సరఫరా సాధ్యం కావడం లేదని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బుడంపాడు చెరువు వాకింగ్ ట్రాక్ కొన్ని ప్రాంతాల్లో కుంగి వాకింగ్ కి ఇబ్బందిగా ఉందన్న స్థానికుల అభ్యర్ధన మేరకు వాకింగ్ కి వీలుగా మరమత్తులు చేపట్టాలని ఏఈని ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ. శ్యాం సుందర్, ఈఈ కొండారెడ్డి, డిసిపి శ్రీనివాస్, ఏసీపి అజయ్ కుమార్, టిపిఎస్ సువర్ణ కుమార్, ఏఈల రవి కిరణ్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *