Breaking News

గండిపడిన రహదారులను నెట్టెం రఘురాం సందర్శన

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ మండలం కంచల గ్రామంలో అకాల వర్షాలు వరదల వలన పూర్తిగా పాడైపోయిన గండిపడిన రహదారులను కూటమినేతలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం సందర్శించారు. అంబారుపేట ఐతవరం నేషనల్ హైవే చుట్టుపక్కల ప్రాంతాలను మరియు పాడైపోయిన పంట పొలాలను సందర్శించారు. రెండు రోజుల నుంచి అకాలంగా కురిసిన వర్షాలకు 1, మరియు 8 వార్డుల్లో ముప్పు ప్రాంతానికి గురైన ప్రదేశాలను సందర్శించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం. ముప్పు ప్రాంతానికి గురైన ఇళ్లల్లోకి వెళ్లి వారిని పరామర్శించి అక్కడి నుంచి నందిగామ ఆర్డిఓ కి ఫోన్ చేస వరద బాధితులకు కుటుంబాల ఆస్తి నష్టాన్ని అంచనా వేయమని చెప్పడం జరిగింది. ఒకటో వార్డు లో పర్యటించి అక్కడ కుటుంబాలకు భరోసాని కల్పించి ఒక పేద కుటుంబం ఇల్లు చిన్నాభిన్నం అవ్వడంతో వారికి కూటమినేతలతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *