-ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూల్లో అత్యాధునిక క్రీడా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను రాష్ట్ర మంత్రి టి.జి భరత్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టి.జి భరత్ ..కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. కర్నూల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని, అత్యుత్తమమైన కోచ్లను నియమించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని అయిన కర్నూలులో క్రీడల అభివృద్ధికి అన్నిరకాల అవకాశం ఉందన్నారు. కర్నూలు నుండి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్లు వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే దేశానికి ఎన్నో పతకాలు తీసుకొస్తారన్నారు.