Breaking News

సేవకులకు రెయిన్ కోటులు, శానిటైజర్లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టి నగర్ లో గత వారం రోజులుగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు, వివిధ సంస్థల వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, 46వ డివిజన్ ప్రత్యేక అధికారి రాజబాబు 46 వ డివిజన్లో రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వర్షం, వరద నీరు, మురుగు వంటి ప్రతికూల వాతావరణంలో సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న యువత వర్షంలో తడుస్తూ కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలను అభినందించి వారికి రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రజల కోసం కష్టపడుతున్న యువతను మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *