Breaking News

ఆన్ బోర్డింగ్ సెషన్స్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఎలక్ట్రిషన్స్ మరియు ప్లంబింగ్ వర్కర్స్ కు, APSSDC/NAC మరియు UC అర్బన్ కంపెనీ ఆధ్వర్యంలో విజయవాడ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జరిగిన ఆన్ బోర్డింగ్ సెషన్స్ కి మొదటి రోజు విశేష స్పందన లభించిందని, ఈ ప్రక్రియ రేపు కూడా కొనసాగుతుందని కృష్ణా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఇటీవల వరద బాధితుల ఇళ్లలో ప్లంబర్, ఎలక్ట్రిషియన్ సేవలు అందించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. జిల్లాలోని ఎలక్ట్రిషన్స్, ప్లంబింగ్ వర్కర్స్ హాజరు అయ్యి ఈ ఆవకాశం సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 8712655686, 8790117279, 8790118349 హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *