Breaking News

దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పై వున్న దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన మంత్రి కొండా పై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. అమ్మ వారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్లు విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గతంలో జరిగిన ఇబ్బoదులను దృష్టిలో ఉంచుకుని అవి పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొండా పై నిర్మిస్తున్న రి టైనింగ్ వాల్ పనులను త్వరిత్తగాతిన పూర్తి చేయాలనీ మంత్రి ఆనం ఆదేశించారు. దసరా ఉత్సవాల నిర్వాహణ కు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో రూపొందించుకుని రావాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈ సారి అమ్మవారి ఉత్సవాలను గతం లోకన్నా మిన్నగా నిర్వహించడం ద్వారా భక్తుల మనోభావాలను గెలుచుకో వా లని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఈ మాత్రం అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఈసమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖా కమిషనర్ ఎస్. సత్యనారాయణ, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగమికి చెందిన చీఫ్ ఇంజనీర్లు, టెక్నికల్ అడ్వైజ ర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *