Breaking News

హెచ్.సి.యల్ పౌండేషన్ సౌజన్యంతో సరుకుల పంపిణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్.సి.యల్ పౌండేషన్ సహకారంతో వాసవ్య మహిళా మండలి వారు బుధవారం స్థానిక కొత్త రాజ రాజేశ్వరి పేట లో వరద బాదితులకు నిత్యవసర సరకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్.సి.యల్ సంస్థ సభులు బి.శ్రీనివాసులు మాట్లాడుతూ వరద ప్రభావంతో ఎందరో నిరాశ్రయులయ్యారని వారికి చేయూతగా హెచ్.సి.యస్ పౌండేషన్ వారు ముంపు ప్రాంతాలలోని ఐదు వేల మందికి నిత్యవసర సరకులను పంపిణి చేయాలని తలంచారని అందులో భాగంగా ఈ రోజు న్యూ రాజ రాజేశ్వరి పేటలో 500 మందికి సరకులను మరియు పరిశుభ్రత కిట్లను పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్.సి.యల్ నుండి మహేంద్ర కాసుల, వై. కిషోర్, వాసవ్య మహిళా మండలి సభ్యులు, హీల్ ఆర్గనైజర్స్ సభ్యులు, సోచరా సభ్యులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *