గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త
విజయవాడలో వరద ప్రభావానికి ప్రధాన కారణమైన డ్రైన్ల ఆక్రమణలను యుద్ద ప్రాదిపదికన తొలగిస్తున్నామని, కల్వర్ట్ ల ను జెట్టింగ్ యంత్రాల ద్వారా, యంత్రాలు వెళ్లడానికి వీలు లేని చిన్న వీధుల్లో గల్ఫర్ యంత్రాలతో మెగా పారిశుధ్య పనులు చేపడుతున్నామని 62వ డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ ఐఏఎస్ తో కలిసి 62వ డివిజన్ లోని ప్రధాన రహదారుల వెంబడి డ్రైన్ల ఆక్రమణలను 3 జెసిబిలు, చిన్న వీధుల్లో నిలిచిన బురదను 7 గల్ఫర్ యంత్రాల ద్వారా, 2 జెట్టింగ్ యంత్రాలతో కల్వర్ట్ లను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడలోని ప్రధాన వరద నీరు పోవడానికి వీలు లేకుండా పలు ప్రాంతాల్లో డ్రైన్ల మీద ర్యాంప్ లు, ఆక్రమణలు ఏర్పాటు చేయడం వలన వరద వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రధాన డ్రైన్ల మీద ఆక్రమణలను బుధవారం జెసిబిల ద్వారా తొలగించడం చేస్తున్నామన్నారు. వ్యర్ధాలు అడ్డుపడి మురుగు నీటి ప్రవాహాన్ని అడ్డుకుకే కల్వర్ట్ ల వద్ద జెట్టింగ్ యంత్రాల ద్వారా శుభ్రం చేస్తున్నామని తెలిపారు. అంతర్గత వీధులు చిన్నవి ఉండడం వలన జెట్టింగ్ యంత్రాలు వెళ్లడంలేదని, ఆయా వీధుల్లో గల్ఫర్ మెషిన్ల ద్వారా బురద తొలగింపు చేపడుతున్నామని తెలిపారు. విజయవాడ 62 వ డివిజన్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబందించి తగిన తోడ్పాటు కోసం అదనపు జెసిబిలు, జెట్టింగ్ యంత్రాలు అందించాలని నగర కమిషనర్ ధ్యాన్ చంద్ కి తెలియచేయగా స్పందించిన ఆయన తక్షణం డివిజన్ కి అందిస్తామని తెలిపారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …