Breaking News

ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత…

-మహా గణపతికి మంత్రి సవిత ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక భావనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. విజయవాడ సితార సెంటర్ లో డూండీ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల మహా విజయ గణపతిని మంత్రి సవిత బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలరాముడు, వారాహి మాత విగ్రహా పత్రిష్టాపన కార్యక్రమంలోనూ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలుగకుండా 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండీ సేవా సమితి సభ్యులను అభినందించారు. ఆధ్యాత్మికభావనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం మంత్రి సవితను డూండీ సేవా సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డూండీ సేవా సమితి సభ్యులు డూండీ రాజేశ్, కొత్త ముక్తేశ్వరరావు, గడ్డం రవికుమార్, డి.సుబ్బారావు, పేర్ల రవికుమార్, కె.శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *