-వ్యర్థాలను సత్వరమే తీసేయాలి
-కమిషనర్ అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య నిర్వాహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని వ్యర్ధాలను తరగతిని తీసేయాలని వరద ప్రభావిత ప్రాంతాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం తన పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన గుణదల, సింగనగర్, శాంతినగర్,సన్రైజ్ కాలని, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట, పైపులు రోడ్డు, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, రామరప్పాడు, కండ్రిక, వాంబే కాలనీ, ఉడా కాలనీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా పారిశుద్ధ్య కార్మికులు, వ్యర్ధాలను సరిగా తీస్తున్నారా లేదా, వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ ఎలా జరుగుతుంది, లాంటి విషయాల పైన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ఇతర పురపాలక సంస్థల నుండి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి, వాళ్లకు విజయవాడ నగరపాలక సంస్థలో కల్పిస్తున్న వసతులు ఎలా ఉన్నాయి, భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి సమయానికి అందుతున్నాయా లేదా అన్న వాటి గురించి కనుక్కున్నారు. తన పర్యటనలో కండ్రికలో ప్రజలు నీటి సరఫరా పై, తమ సమస్యను కమిషనర్ కి తెలుపగా, వెంటనే తగు చర్యలు తీసుకొని వాళ్లకి నీటి సరఫరా సత్వరమే అందేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.