Breaking News

సీఎం చంద్ర‌బాబును క‌లిసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :

తెలంగాణ జలవనరులు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వంగా కలిశారు. గురువారం సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడుతో వారు భేటీ అయ్యారు. అయితే తన చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణితో కలిసి విజయవాడ వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. తన వ్యక్తిగత పని ముగించుకున్న ఉత్తమ్ దంపతులు.. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు.

 

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *