-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛతే సేవాగా భావించి “స్వచ్ఛత హి సేవ” నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుగుణంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేది వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేయమంటూ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ బుడమేరు వరదల తర్వాత విజయవాడ నగర ప్రజలకు స్వచ్ఛతలో సహాయపడుతూ, ప్రజలను, వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో స్వచ్ఛత కార్యక్రమాలు రూపొందించేటట్టు ప్రణాళికలను సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు.