Breaking News

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల ప్రణాళిక సిద్ధం చెయ్యండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛతే సేవాగా భావించి “స్వచ్ఛత హి సేవ” నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుగుణంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేది వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేయమంటూ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ బుడమేరు వరదల తర్వాత విజయవాడ నగర ప్రజలకు స్వచ్ఛతలో సహాయపడుతూ, ప్రజలను, వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో స్వచ్ఛత కార్యక్రమాలు రూపొందించేటట్టు ప్రణాళికలను సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *