Breaking News

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్ను బకాయిదారులు అందరూ తమ తమ ఆస్థి పన్ను, కుళాయి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, వాటర్ మీటర్ చార్జీలు మరియు ఖాళీ స్థలముల పన్నులను ఈ అర్ధ సంవత్సరం ది.30-09-2024 లోపు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించవలసినదిగాను, మరియు తదుపరి విధించబడు పెనాల్టి నుండి ఉపశమనం పొందవలసినదిగా కోరడమైనది. ప్రజల సౌకర్యార్ధo విజయవాడ నగరపాలక సంస్థ పరిధి లోని 3 సర్కిల్ కార్యాలయములలోను మరియు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం లోను ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు అన్ని శెలవు దినములలో కూడా తెరచి ఉంచబడునని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటనలో తెలియజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *