-క్యాబినెట్ సమావేశానికి ముందు వినతులు పరిశీలించిన మంత్రి లోకేశ్
-వాటిని సంబంధిత మంత్రులకు ఇచ్చి పరిష్కారం చూపాలని సూచన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. తన వద్దకు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరిస్తూ.. వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. వాట్సాప్, ట్విట్టర్ ద్వారా అందిన వినతులను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకుసాగుతున్నారు. క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడానికి ముందు మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్లో తన వద్దకు వచ్చిన వినతులను సంబంధిత మంత్రులకు అందజేశారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.