అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీశైలం నియోజకవర్గం తరపున రూ. 2,22,70,749/- అక్షరాలా రెండు కోట్ల ఇరవై రెండు లక్షల డైబ్బైవేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయులు విరాళం అందజేయడం జరిగింది. నేడు వెలగపూడిలోని సచివాలయంలో రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు శాఖ మంత్రి బీ.సి. జనార్దన్ రెడ్డి, న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి 2,22,70,749 కోట్ల రూపాయులు చెక్కును శ్రీశైలం నియోజకవర్గం ప్రజల తరపున ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు.. వరద బాధితులకు తమ వంతుగా సాయం అందించాలనే సదుద్దేశ్యంతో శ్రీశైలం నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి ప్రజల దగ్గర విరాళాలు సేకరించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేసిన శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు రాష్ట్రానికే ఆదర్శప్రాయంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మంత్రులు బీ.సీ జనార్ధన్ రెడ్డి, ఎన్. ఎండీ. ఫరూక్ లు సైతం అభినందించారు.
Tags amaravathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …