Breaking News

పార్కుల్లో స్వచ్ఛత హి సేవ

-సింగల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వచ్ఛత హీసేవలో భాగంగా, ప్రజలను ఎంతగానో ఆహ్లాదపరిచే రాజీవ్ గాంధీ పార్క్, రివర్ ఫ్రంట్ ప్లాజా లో శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2024 వరకు జరుపుకుంటున్న స్వచ్ఛత హి సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాలలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారని అన్నారు. శుక్రవారం రాజీవ్ గాంధీ పార్క్, రివర్ ఫ్రంట్ ప్లాజా మరియు స్క్రాప్ పార్కులలో నగర పౌరుల సహకారంతో పార్కులను పరిశుభ్రపరుస్తూ, ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చేయటమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని తెలిపారు. అంతేకాకుండా సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేలా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, నగర పౌరులు ర్యాలీలో పాల్గొని ప్రజలకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించి, వాళ్లకు అవగాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహించారని అన్నారు అందులో భాగంగా శుక్రవారం ఉదయం గాంధీజీ మహిళా కళాశాల, బీసెంట్ రోడ్ మరియు కృష్ణవేణి రోడ్లలో విద్యార్థిని, విద్యార్థులు, నగర పౌరులు ర్యాలీని నిర్వహించి ప్రజలందరికీ అవగాహన కల్పించారని తెలిపారు. బీసెంట్ రోడ్ లో జరిగిన సింగల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ర్యాలీ కార్యక్రమంలో టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజలకు కలిగే నష్టాలు గురించి వివరిస్తూ బీసెంట్ రోడ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై ర్యాలీ చేస్తున్న విద్యార్థులకు టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ బాలస్వామి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్ ఉమ్మిడి వెంకటేశ్వరావు (చంటి), అడిషనల్ కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె. వి. సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. రత్నవాళి, శానిటరీ సూపర్వైసర్లు ఇన్స్పెక్టర్లు, సెక్రటరి లు, విధార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *