Breaking News

Andhra Pradesh

విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో చిన్న కాంట్రాక్టరులు న‌ష్ట‌పోకుండా ఎంపీ కేశినేని శివ‌నాథ్ చ‌ర్య‌లు

-ఆగిపోయిన బిల్లుల‌కు నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకి విజ్ఞ‌ప్తి -ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్వంలో కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడును క‌లిసిన గోల్డ్ మెడ‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ జైన్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ టెర్మిన‌ల్ నిర్మాణ పనులకి సంబంధించి కాంట్రాక్ట‌ర్ మార‌టంతో….చిన్న చిన్న కాంట్రాక్ట‌ర్లు ఇబ్బంది ప‌డ‌కుండా ఎంపీ కేశినేని శివ‌నాథ్ త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్ లో కేంద్ర పౌర విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడును ఆయ‌న …

Read More »

టిడిపి ఎంపీల‌కు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా తేనీటి విందు

-హాజ‌రైన ఎంపీలు కేశినేని, వేమిరెడ్డి , తెన్నేటి, మాగుంటి, బైరెడ్డి -తొలిసారి సభకు వచ్చిన వారికి ఎక్కువ అవ‌కాశం ఇవ్వాల‌ని ఎంపీలు విజ్ఞ‌ప్తి -సానుకూలంగా స్పందించిన లోక స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త: లోక స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా పార్ల‌మెంట్ లోని త‌న కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం సాయంత్రం టిడిపి ఎంపీల‌కు ఇచ్చిన తేనీటి విందుకు బాప‌ట్ల ఎంపీ లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌ తెన్నేటి ప్ర‌సాద్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి , ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డి, …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యం

-శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు- -స్వల్పకాలిక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షిస్తాం -రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: కలియుగ దైవం  వేంకటేశ్వర స్వామి వారు కొలువైవున్న తిరుమల తిరుపతి దేస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం అని, శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ …

Read More »

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

-వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం -త్వరలోనే రాష్ట్రమంతటా శిక్షణా తరగతులు -ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు -లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు ప్రణాళికలు -వ్యవసాయం, అనుబంధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు.. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు …

Read More »

నున్నలో రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ

-విజయవాడ రూరల్ 9 గ్రామాలు వీఎంసీలో విలీనం చేయాలి -రూరల్ గ్రామాల సమస్యలకు వీఎంసీ లో విలీనమే పరిష్కారం -తిరుమల లడ్డూ అంశంలో రాజకీయాలు సరికాదు -సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి అరెస్ట్ సమంజసమే -రాజకీయాల్లో భాషా నియంత్రణ అవసరం గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త: గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. గతంలో ఈ గ్రామాలు ఉమ్మడి …

Read More »

జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి తెనాలి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, ల్యాబ్‌లను పరిశీలించి, అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతుల స్థితిగతులను సమగ్రంగా పర్యవేక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి నేరుగా మమేకమై మాట్లాడుతూ, వారికి అందుతున్న వైద్య సేవలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల లబ్ధి, వసతులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మరింత నాణ్యమైన, సానుకూల వైద్య సేవలు …

Read More »

తిరుణాళ్ళకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: క్వారీ తిరునాళ్లకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ కోరారు. మంగళవారమ ఉదయము చేబ్రోలు మండలం క్వారీ లో గల శ్రీ బాల కోటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద మహా శివరాత్రి తిరుణాళ్ళ ఏర్పాట్లపై డివిజన్ స్థాయి అధికారులతో పొన్నూరు శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెనాలి ఇంచార్జ్ సబ్ …

Read More »

5న సాగునీటి సంఘాల అధ్యక్షుల సదస్సు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలోని అన్ని సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఈ నెల 5వ తేదీన సదస్సును నిర్వహిస్తున్నారు. “మన నీరు-మన భవిష్యత్తు” సాగునీటి సంఘాల పాత్ర శీర్షికన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సదస్సు అమరావతిలో హైకోర్టు దగ్గర పెరేడ్ గ్రౌండ్స్ లో 5వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుండి జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున సాగునీటి సంఘాల అధ్యక్షులు హాజరు కానున్నారని జలవనరుల శాఖ అధికారులు …

Read More »

బకాయి ఉన్న పన్ను వసూళ్లకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్న పన్ను వసూళ్లకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఉండాలని, డిప్యూటీ కమిషనర్లు పన్ను వసూళ్లపై రోజువారీ నివేదిక ఇవ్వాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ విభాగ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధికి పన్ను వసూళ్లు కీలకమని, నగర ప్రజలు కూడా సకాలంలో పన్ను చెల్లించాలని కోరారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది …

Read More »

ప్రజలకు పారదర్శకంగా సేవలందించండి

– అవినీతికి తావులేకుండా పనిచేయాలి – సేవల దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త: రవాణా శాఖ ద్వారా ప్రజలకు అత్యంత పారదర్శకమైన, నాణ్యమైన అవినీతిరహిత సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ డా. జి.లక్ష్మీశ రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా ప్రజల నుండి వచ్చిన అభిప్రాయాల సేకరణపై చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ …

Read More »