Breaking News

Andhra Pradesh

ప్రభుత్వ పథకాల లబ్ధికి ఈ-కేవైసీ తప్పనిసరి

-డిజిటల్ సేవల కోసం “మనమిత్ర”యాప్ -నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రకాల సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన ప్రజలందరికీ ఎటువంటి అంతరాయం లేకుండా, నిరంతరాయంగా అందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఇంకా ఈ-కేవైసీ చేసుకోకుండా ఉంటే, వారు వెంటనే తమ …

Read More »

అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించాలి… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులలోనూ నాణ్యత అత్యంత ప్రధానమని, నాణ్యత ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నగరంలోని చుట్టుగుంట, మురికిపేట, వి.ఐ.పి రోడ్డు, కృష్ణ బాబు కాలని, చంద్రబాబు నాయుడు కాలని తదితర ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి, సదరు ప్రాంతాలలో జరుగుతున్న మరియు పూర్తైన అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు …

Read More »

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా జూన్ 9వ తేదీ జరిగే రాస్తారోకోలను జయప్రదం చేయండి…

-వామపక్ష పార్టీల పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని బిజెపి, విధానాల వలన దేశంలో చమురు ధరలు సామాన్యుడికి మోయలేని భారంలా మారాయని వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.ఈ నెల 9 తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలకు పిలుపులో భాగంగా విజయవాడలో చేపట్టనున్న రాస్తారోకో ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ రోజు సాయంత్రం వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయం (దాసరి భవన్) లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ గత మే …

Read More »

మహిళా సాధికారత చట్ట సభలలో మహిళా రిజర్వేషన్ అమలుతోనే సాధ్యం!..ఎన్ఎఫ్ఐడబ్ల్యూ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతీయ మహిళా సమాఖ్య 72 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భముగా ఈ రోజు స్థానిక దాసరి భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకురాలు కొరగంజి దుర్గాంబ పతాకావిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ ఈ సందర్భముగా మాట్లాడుతూ మహిళలకు హక్కుల కోసం ఏర్పడి మహిళా సాధికారత చట్టసభలలో …

Read More »

APCRDA ఆధ్వర్యంలో “డిస్ట్రిక్ట్ కూలింగ్” విధానంపై సాంకేతిక అవగాహన సదస్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి, సుస్థిరమైన రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపీఏ) అమరావతి చాప్టర్, ISHRAE విజయవాడ చాప్టర్‌ల సహకారంతో “అమరావతికి డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థ” అంశంపై రాయపూడిలో APCRDA ప్రధాన కార్యాలయంలో గురువారం సాంకేతిక అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో APCRDA, ADCL, AGICL, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు …

Read More »

ప్రజారోగ్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణ, వర్షాకాల సన్నద్ధతపై సమగ్ర సమీక్ష

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల సమావేశ మందిరంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు ఆధ్వర్యంలో ప్రజారోగ్య శాఖ అధికారులతో, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ నుండి కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలపై …

Read More »

స్వ‌ర్ణ గ్రామం, వార్డు ఉద్యోగులకు సామ‌ర్థ్య నిర్మాణం

– ప్ర‌తి గురువారం ప్ర‌త్యేక మాడ్యూల్‌తో సెష‌న్లు – రాష్ట్రంలో తొలిసారిగా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వినూత్న చొర‌వ‌! – ఒత్తిడి ర‌హిత వాతావ‌ర‌ణంలో విధుల నిర్వ‌హ‌ణ‌కు బాట‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు, వార్డులను ఆదర్శవంతమైన ప‌రిపాల‌న సేవల కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వ‌ర్ణ గ్రామం, స్వ‌ర్ణ వార్డు కార్యాల‌యాల ఉద్యోగుల‌కు ప్రతి గురువారం మధ్యాహ్నం గంట‌న్న‌ర‌పాటు సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) కార్యక్రమాలను నిర్వహిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఎన్‌టీఆర్ జిల్లా …

Read More »

గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నత స్థాయి సమీక్ష

-సికిల్ సెల్ అనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రత్యేక దృష్టి -గిరిజనుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చర్యలు -జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగ పరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య (Shri Antar Singh Arya) …

Read More »

యువత చేతుల్లోనే రేపటి భారత్!

– విద్య‌, నైపుణ్యాలు పెంపొందించుకొని ఉన్న‌తంగా ఎద‌గాలి – ఆధునిక సాంకేతిక‌త‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – సోష‌ల్ మీడియాను దుర్వినియోగం చేయొద్దు – గిరిజ‌నుల సాధికారత ల‌క్ష్యంగా క‌మిష‌న్ అడుగులు – జాతీయ ఎస్‌టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ అంతర్ సింగ్ ఆర్యా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని.. నేటి యువత నైపుణ్యాలను పెంపొందించుకుని, ఉన్న‌తంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జాతీయ ఎస్‌టీ కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ) ఛైర్మ‌న్ అంతర్ సింగ్ ఆర్యా అన్నారు. జాతీయ ఎస్‌టీ …

Read More »

విజయవాడలో ‘గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్’ను ప్రకటించిన ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో, 12 జూన్ 2026న విజయవాడలోని ఎస్.ఎస్. (SS) కన్వెన్షన్‌లో ‘గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్ (GIC) 2026’ను నిర్వహిస్తోంది. ఇదే ప్రాంగణంలో జూన్ 11 నుండి 13 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ‘గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో’లో భాగంగా ఈ సదస్సు నిర్వహించబడుతోంది. ‘ఆంధ్రప్రదేశ్ – భారతదేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు ముఖద్వారం’ (Andhra Pradesh …

Read More »