Breaking News

Andhra Pradesh

ఇంటర్మీడియట్ పబ్లిక్ & ప్రాక్టికల్ పరీక్షలు–2026 సజావు నిర్వహణకు సమన్వయ సమావేశం

-ఫిబ్రవరి/మార్చి–2026 పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు – డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌లో బుధవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ మరియు ప్రాక్టికల్ పరీక్షలు–2026 నిర్వహణపై సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఫిబ్రవరి/మార్చి–2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు …

Read More »

సీతానగరంలో 22న IOCL లెవల్–III ఆఫ్‌సైట్ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

-పైప్‌లైన్ భద్రత, అత్యవసర చర్యలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం -మిథున్ కుమార్ శీలం, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పరిధిలోనిపారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్ (PHPL) – రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆగ్నేయ ప్రాంత పైప్‌లైన్స్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మిథున్ కుమార్ శీలం తెలిపారు. ఈ మాక్ డ్రిల్‌ను తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ …

Read More »

వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపు

-కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 విడతలుగా 9 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు -క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా ఏర్పాట్లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సదరు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు, అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఒన్ హెల్త్ ‘ ప్రోగ్రాం కింద నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి వ్యాధుల నివారణలో సంబంధిత శాఖల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ డీసిజ్ …

Read More »

గ‌ణ‌తంత్ర స్ఫూర్తితో వేడుక‌ల‌కు సిద్ధంకండి

– ప్ర‌గ‌తి ప‌థం, ప్ర‌జ‌ల‌ను చైత్య‌వంతుల‌ను చేసేలా శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌ – అధికారులు స‌మ‌న్వయంతో ప‌నిచేయండి – ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌పై క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను గణతంత్ర స్ఫూర్తికి అనుగుణంగా ఘనంగా నిర్వ‌హించేందుకు అన్ని శాఖ‌ల అధికారులు స‌మన్వయంతో పనిచేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 26న విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలో ప్ర‌ప‌థంగా ఎన్‌టీఆర్ …

Read More »

వివక్ష లేని కులరహిత సమాజమే ఎస్సీ కమిషన్ లక్ష్యం

– కుల వ్యవస్థలో అసమానతలు రూపుమాపేందుకు ఎస్సీ కమిషన్ పోరాడాలి -అణగారిన కులాల గొంతుకగా ఎస్సీ కమిషన్ పనిచేయాలి – దళితులు కూటమి ప్రభుత్వం అందించే అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎదగాలి – కొత్తపల్లి శామ్యూల్ జవహర్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసం పనిచేస్తూనే, వివక్ష లేని కులరహిత సమాజమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ అన్నారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో …

Read More »

విద్యార్థులకు ఇది కీలక సమయం.. అలసత్వం వద్దు..

–విద్యార్థులకు ఇది కీలక సమయం.. అలసత్వం వద్దు.. -పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయండి.. -చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి.. -తల్లిదండ్రుల నమ్మకాన్ని రెట్టింపు చేసేలా ఫలితాలు సాధించాలి… -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న నెల రోజులు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా ఎదురుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పరీక్ష ఫలితాలలో పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు …

Read More »

వైద్య సేవ‌ల్లో నిర్ల‌క్ష్యాన్ని స‌హించేది లేదు

– ప్ర‌తిఒక్కరికీ నాణ్య‌మైన వైద్యం అందాల్సిందే – క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ప్రజలు స‌మ‌స్య‌ను త‌న‌కు నేరుగా తెలియ‌జేయొచ్చు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పటిష్టమైన ప్రణాళికతో అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఈ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుతో ప్రతి పౌరుడికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా క‌లెక్ట‌ర్ …

Read More »

దావోస్ లో మూడో రోజూ సీఎం చంద్రబాబు పర్యటన

-పారిశ్రామిక పురోగతి పై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సెషన్ లో ప్రసంగించనున్న సీఎం -దావోస్ లో వివిధ పారిశ్రామిక వేత్తలతో భేటీకానున్న ముఖ్యమంత్రి దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా మూడో రోజూ కీలకమైన సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముఖాముఖి భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హొరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్ …

Read More »

రాష్ట్రంలో యువతకు ఏఐ, క్వాంటం, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ

-10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని ఐబీఎం సీఈవోను కోరిన సీఎం -క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆహ్వానం -దావోస్‌లో దిగ్గజ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం, సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐబీఎం చైర్మన్, సీఈవోను కోరారు. దావోస్ పర్యటన రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఐబీఎం చైర్మన్ అర్వింద్ కృష్ణ తో సమావేశం …

Read More »

అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి

-ఓ తరం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి -లోకల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహం -దావోస్ వేదికగా ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు -ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగిన చర్చా వేదికలో ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానానికి కితాబు దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదని… అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి… అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ …

Read More »