Breaking News

Monthly Archives: July 2024

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. మంత్రి శనివారం ఉదయం తమ నివాసంలో కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, సృజనలకు ఫోన్ చేసి ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎగువ నుండి వస్తున్న వరదను, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులకు తగు …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి

-తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు క్షేత్ర స్థాయిలో సూచనలు అందించాలి. -రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేయండి. -రైతు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి. – – -రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, …

Read More »

బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చల్లపల్లి తహసీల్దార్ బీ.సుమతి శనివారం ఒక ప్రకటనలో కోరారు. చల్లపల్లి రైతు బజారులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 113 మంది 1,245 కేజీలు రా రైస్, 34 మంది 385 కేజీల స్టీమ్ రైస్, 173 మంది 146 కిలోల కందిపప్పు కొనుగోలు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని రిలయన్స్ స్మార్ట్ బజారులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా 24 మంది 50 …

Read More »

వాహన్ పోర్టల్ అమలు తీరుపై లారీ ఓనర్స్ ఆవేదన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రవాణాశాఖ ఆన్ లైన్ సేవలను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వ పోర్టల్‌ ఈ-ప్రగతితో పాటు కేంద్రప్రభుత్వ వెబ్ సైటు వాహన్‌ ద్వారా అందిస్తూ వచ్చిన అధికారులు ఇకపై ఈ-ప్రగతి స్థానంలో వాహన్‌ పోర్టల్‌ ను విస్తరించేందుకు ఎన్టీఆర్‌ జిల్లాలో చేపట్టిన డేటా బదలాయింపు ప్రక్రియ వల్ల వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుమోతు రాజా అన్నారు. శనివారం ఉదయం విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ …

Read More »

కంశాలిపాలెం పునరావాస కేంద్రంలో భోజన వసతి

-పాములు పట్టే వాళ్ళు ద్వారా పట్టుకున్న పాములు -హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు -ఎస్ డి టి కృష్ణా నాయక్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కంసాలి పాలెం పునరావాస కేంద్రంలో ముంపు ప్రాంతంలో ని కుటుంబాల వారికి కలెక్టర్ వారి ఆదేశాల మేరకు భోజన వసతి కల్పించడం జరిగిందని కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్.. కృష్ణ నాయక్ తెలిపారు. శనివారము మధ్యాహ్నాం కంసాలి పాలెం ఎంపిపి స్కూలు లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, …

Read More »

ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని  క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే భాద్యత అధికారులపై ఉంది

-మండలంలో చేపట్టిన పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించండి -ఎర్ర కాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా   ఆధునీకరణ  పనులను చేపట్టాల్సిఉంది. -నష్టపోయిన రైతాంగానికి  ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా ప్రభుత్వం చర్యలుచేపడుతుంది. -ఇప్పటికే ఎకరాకు రు. 20 వేలు పెట్టుబడి పెట్టిన రైతాంగం -మండల స్థాయి తొలి సమీక్ష సమావేశంలో పాల్గొన్న…. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన …

Read More »

వరద ఉధృతి ప్రాంతాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన

-పునరావాస కేంద్రాలను, ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు పర్యవేక్షించిన కలెక్టర్ -అపరిశుభ్రతకు తావు లేకుండా గ్రామాల్లో పక్కాగా శానిటేషన్ అమలు చేయాలి. -జిల్లాలో ఇప్పటివరకు 10 వేల హెక్టార్ల పంట నష్టం వేశాం. -ప్రభుత్వాదేశాలు మేరకు నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అందించే దిశగా చర్యలు. -కలెక్టర్ పి ప్రశాంతి నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతా ల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతంలోని కుటుంబాలను చేర్చే విధంగా అధికారులు అవగాహన కల్పించి సత్వర చర్యలు చేపట్టాలని …

Read More »

ఆటో మేటిక్ వాతావరణ కేంద్రం పరిశీలన

-పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి -ముంపు ప్రాంతాలలో పర్యటన.. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి -రావిమెట్ల ఎంపిపి స్కూలు వైద్య శిబిరం పరిశిలన -వైద్య శిబిరం సందర్శన, నెలలు నిండిన వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాలి – జిల్లా కలెక్టర్ పి..ప్రశాంతి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలులో ఏర్పాటు చేసిన ఆటో మేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం ఉదయం కలెక్టర్ పి. ప్రశాంతి తనిఖీ చేశారు. ఈ పరికరం యెుక్క పనితీరు పై సమగ్ర సమాచారాన్ని అడిగి …

Read More »

వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం

-గత పాలకుల నిర్లక్ష్యంతోనే జిల్లాలో మురుగు సమస్య -సాగునీటి కాల్వలన్నీ తూడు, మట్టితో నిండిపోయాయి -వీలైనంత త్వరగా సాగునీటి కాల్వల్ని శుభ్రం చేయండి -సాగునీటి రంగ సమస్యలపై కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తలెత్తిన వరదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను రాష్ట్ర గనులు, భూగర్భ & ష్టిఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బందితో ఫోన్లో మాట్లాడారు. గత …

Read More »

ఎం.పి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి రాష్ట్ర అధ్య‌క్షుడు గాజువాక ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్ శ‌నివారం గురునాన‌క్ కాల‌నీలోని ఎన్టీఆర్ భ‌వ‌న్ లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీనివాస్ కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. పల్లా శ్రీనివాస్ పుష్ప‌గుచ్ఛం అందించి ఎంపి కేశినేని శివనాథ్ ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు.అనంత‌రం పల్లా శ్రీనివాస్ కు పుష్ప‌గుచ్చం అందించి శాలువాతో ఎంపి కేశినేని శివనాథ్ స‌త్క‌రించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు …

Read More »