Breaking News

Daily Archives: September 13, 2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి రాస్ట్రేతరులు విరాళాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాస్ట్రేతరులు కూడా ముందుకొచ్చి విరాళాల అందించడం మంచి పరిణామమని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో తెలిపారు. వరద బాధితులకు పెద్ద ఎత్తున సోదర భావంతో విరాళాలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇలాంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అన్నారు. We the People India, NGO మరియు YESWECAN సభ్యులు, Kings college London అలుమ్ని సభ్యులు కలసి …

Read More »

బాధితులను ఆదుకోవడం అభినందనీయం

-జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ పది రోజులపాటు ముంపు బాధితులకు నిరంతరం సేవలు అందించడంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది నమగ్నమయ్యారని.. అదేవిధంగా ఆ శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగులు కూడా ముంపు బాధితులకు చేయూతనివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు మహిళా, శిశు సంక్షేమ శాఖ విశ్రాంత అధికారుల సహకారంతో సమకూర్చిన …

Read More »

బుడ‌మేరు ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించి నివేదికివ్వండి

– స‌ర్వే నంబ‌ర్ల వారీగా వివ‌రాల‌ను స‌మ‌ర్పించండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్య‌త్తులో బుడ‌మేరు వ‌ర‌ద ముంపు నుంచి శాశ్వ‌త ప‌రిష్కారానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ బుడ‌మేరుకు అత్యంత ప్రాధాన్య‌మిస్తోంద‌ని.. ఈ నేప‌థ్యంలో స‌ర్వే, ల్యాండ్ రికార్డ్స్‌; ఇరిగేష‌న్‌, వీఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు చేప‌ట్టి స‌ర్వే నంబ‌ర్ల‌తో స‌హా ఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించి పూర్తినివేదిక స‌త్వ‌రం స‌మ‌ర్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఆదేశించారు. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌ల గుర్తింపున‌కు తొలిద‌శ‌లో …

Read More »

బీమా క్లెయిమ్‌ల ఫెసిలిటేష‌న్ కేంద్రం శ‌ని, ఆదివారాల్లోనూ ప‌నిచేస్తుంది

-వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి -ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల ఆస్తి న‌ష్టాల‌కు సంబంధించి బీమా క్లెయిమ్‌ల స‌త్వ‌ర ప‌రిష్కారానికి విజ‌య‌వాడ స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేష‌న్ కేంద్రం శ‌ని, ఆదివారాల్లోనూ ప‌నిచేస్తుంద‌ని ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బాధితుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో సెల‌వురోజులైన శ‌ని, ఆదివారాల్లో కూడా ఫెసిలిటేష‌న్ కేంద్రం ప‌నిచేసేలా …

Read More »

మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలిసిన ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ని సెక్రటేరియట్ లో ఆయన ఛాంబర్ లో ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, ఫౌండర్ చైర్మన్ డా. వేముల భాను ప్రకాష్, సభ్యులతో శుక్రవారం కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో ఆయుష్ చికిత్సలు చేర్పించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రపోజల్స్ కేంద్రప్రభుత్వం కి పంపించేటట్లు సహకరించాలని కోరారు. ఈ విషయం పై మంత్రి స్పందిస్తూ కేంద్రప్రభుత్వం ఆయుష్ …

Read More »

బిజెపి సభ్యత్వ నమోదుని విజయవంతం చేయాలి

-ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ బోగవల్లి శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ బోగవల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోగవల్లి శ్రీధర్ మాట్లాడుతూ సెప్టెంబర్లో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించామన్నారు. ఇటీవల సంభవించిన వరదల దృష్ట్యా బిజెపి నేతలు అంతా సహాయక చర్యలో ఉండటం వలన సభ్యత్వ నమోదు కొంతమేర …

Read More »

నేడే జాతీయ లోక్ అదాలత్

-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 14.9.2024 జాతీయ లోక్ అదాలత్ -రెండవ శనివారం ఉదయం 10 గంటల నుంచి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం /కాకినాడ /అమలాపురం /రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని కోర్టుల యందు ది. 14.09.2024 న (రెండవ శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుననీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార …

Read More »

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్‌

-సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు పక్షం రోజులపాటు “స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాలు -యువతను భాగస్వామ్యంతో విజయవంతం చేద్దాం -స్వచ్చత హి సేవా కార్యక్రమం మన కార్యాలయం నుంచే నిర్వహించుకుద్దాం -వ్యర్థాల నుంచి వినూత్నమైన ఆవిష్కరణలు చేపట్టాలి. -శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఒక సందేశం ఇవ్వడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి -ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యంతో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి -కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘స్వచ్ఛత హి సేవా పక్షం రోజులు …

Read More »

జపాన్ దేశంలో హాస్పిటల్ యందు కేర్ టేకర్స్ ఉద్యోగాలకు శిక్షణ

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 18 -జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నావిస్ హెచ్ ఆర్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం/ జీఎన్ఎం/బీఎస్సీ-నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాషను ఎన్5, ఎన్4, ఎన్3 స్థాయిల్లో నేర్పించి, వారికి జపాన్ దేశంలో హాస్పిటల్ యందు కేర్ టేకర్స్ గా ఉద్యోగావకాశలు కల్పించడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు జపాన్ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి, …

Read More »

“వికసిత్ ఆంధ్ర విసన్2047”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “వికసిత్ ఆంధ్ర విసన్2047 “లో భాగంగా మన జిల్లా స్థాయిలో పలు కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా కలెక్టర్ ఆదేశించి ఉన్నారు. ఇందులో భాగంగా మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 6 నుండి 10 తరగతి వరకు చదివే విద్యార్థినీ విద్యార్థుల కు “వికసిత్ ఆంధ్ర విషన్2047” అనే అంశంపై వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను మండల స్థాయి పోటీలను నిర్వహించి, ప్రతి మండలం నుండి మొదటి మరియు ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులను జిల్లా స్థాయి లో ఈరోజు …

Read More »