Breaking News

తోపుడు బండి వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ కు చెందిన ఎనపర్తి ఆదినారాయణ గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి భార్య హైమావతి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక నాయకులు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్  దేవినేని అవినాష్  దృష్టికి తీసుకురాగా వారి జీవనోపాధి నిమిత్తం “దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్” ద్వారా దాదాపు 20000 రూపాయల విలువ గల తోపుడు బండిని సోమవారం ట్రస్ట్ వైస్ ఛైర్మన్ దేవినేని సుధీర అందజేయడం జరిగింది.* వీలైనంత త్వరగా వారికి వితంతు పెన్షన్ మంజూరు చేయాలని సంబంధిత సచివాలయ అధికారులకు అవినాష్ సూచించడం జరిగింది. సుధీర మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య,ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కార్పొరేటర్ చింతల సాంబయ్య,డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గా ప్రసాద్, వైసిపి నాయకులు పర్వతనేని గోవర్ధన్ రావు, రమాయణపు శ్రీనివాస్, ఉకోటి రమేష్, చలపాటి సన్నీ, సిద్ధయ్య,మరీదు ఉమ, ఫ్రూట్స్ మల్లి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *