Breaking News

రాష్ట్ర పర్యటన ముగించుకుని గోవా బయలుదేరిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం గోవా బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుండి ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానంలో గోవా బయలుదేరిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు వీడ్కోలు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత భార్గవ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, డీసీపీ హర్షవర్ధన్ రాజు, జిల్లా కలెక్టర్ జె నివాస్ , ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ ఎం.బి.వి.శర్మ, నూజివీడు ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి , ఎయిర్పోర్ట్ అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *