రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 315 ఆర్బీకేల పరిధిలో 233 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 147 మిల్లులను ఆయా కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసామన్నారు.ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు పూర్తి పారదర్శకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలని ఆమె కోరారు. మిల్లర్లు పేర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సానుకూల పరిష్కారం కొసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి రబీసీజన్ ధాన్యం కొనుగోలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో సిబ్బందికి శిక్షణ సాంకేతిక పరమైన అవగాహన కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్థేశించుకోవడం జరిగిందన్నారు. ఆమేరకు ధాన్యం కొనుగోళ్ళు చేపట్టాలని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో డియం ఏ.కుమార్, మిల్లర్ల అసోషియేషన్ అధ్యక్షలు ఎన్. మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షలు కే.శ్రీధర్, కార్యదర్శి టి. సుబ్బిరామిరెడ్డి, సభ్యులు యం. వెంకట కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.