తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని, మంజూరైన గృహాలు పెండింగ్ లేకుండా పురోగతిలో వుండాలని, క్షేత్రస్థాయి ఇబ్బందులు తెలియజేయాలని గృహనిర్మాణ సంస్థ ఓ.ఎస్.డి. రామంచంద్రా రెడ్డి సూచించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో గృహనిర్మాణలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గృహనిర్మాణ సంస్థ ఓ.ఎస్.డి. రామంచంద్రా రెడ్డి ఎం.పి.డి.ఓ.లతో, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఓ.ఎస్.డి. రామంచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే గృహాలు నిర్మించుకున్న వారు తప్పనిసరి ఇళ్ళల్లో వెస్ట్ వాటర్ వెళ్ళడానికి సోక్ పిట్స్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. జగనన్న కాలనీల్లో వసతులు విద్యుత్, నిర్మాణాలకు నీటిసదుపాయం, బిల్డింగ్ మెటీరియల్ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. కేటగిరి 3 ఆప్షన్ లబ్దిదారుల గృహాల కాంట్రాక్టర్ పురోగతి జరిగిన వెంటనే స్టేజ్ వైజ్ బిల్లులు అప్ లోడ్ చేయాలనీ సూచించారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులువున్న వాటిని తెలియజేయాలని ప్రతి శనివారం అక్కడికి వెళ్లి పరిష్కరించడానికి రానున్నామని అన్నారు. గృహనిర్మాణాల ప్రాధాన్యత వివరించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలని నరేగా లో 90 రోజుల పనిదినాల మొత్తాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మండల వారిగా పురోగతి సమీక్షించి పలు సూచనలు చేసారు.ఈ సమీక్షలో పిడి హౌసింగ్ వెంకటేశ్వర రావు, ఆర్ డబ్ల్యు ఎస్ ఇఇ విజయకుమార్ , అన్నిమండలాల ఎం.పి.డి.ఓ లు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags tirupati
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …