మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానం ఏర్పాటు చేసిన 386 ప్రత్యేక బెంచ్ ల ద్వారా జరిగిన లోక్ అదాలత్ లో పోలీస్ శాఖకు సంభందించి మొత్తం 1,22,146 కేసులను పరిష్కరించడం జరిగింది. అందులో 19,150(UnderInvestigation cases-7970. PendingTrail cases-11180) కంపౌండబుల్ IPC కేసులు (భూమి, ఆస్తి, హక్కులపై వివాదాలు,చిన్న నష్టాలు, గాయాలు, చిన్న దొంగతనాలు, దోపిడీలు, సాదారణ స్థాయిలో హింస).వంటి కేసులు కాగా ఐపిసి కాని ఇతర కేసులు మరియు పెట్టి కేసులు 1,02,996 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగింది. లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ద చూపిన ఎన్టిఆర్ జిల్లా, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప,చిత్తూరు జిల్లా ఎస్పీలను, సిబ్బందిని అభినందించారు.
Tags mangalagiri
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …