Breaking News

ఘనంగా శ్రీ అంకమ్మ తల్లి ముఖమండప ప్రారంభోత్సవం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం, తిప్పలకట్టలో వేంచేసియున్న శ్రీ అంకమ్మ తల్లి ముఖమండప ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం తిప్పలకట్టలో వేంచేసియున్న శ్రీ అంకమ్మ తల్లి ముఖమండప ప్రారంభోత్సవం కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారు మహాశక్తివంతురాలు అని భక్తులు కోర్కెలు తీర్చే శక్తిస్వరూపిణి అని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి తమ కోర్కెలు కోరి తీరిన తరువాత వచ్చిన మొక్కులను చెల్లించుకుని వెళుతుంటారని అన్నారు. దానిలో భాగంగానే భక్తులు స్వచ్ఛందంగా విరాళాల ద్వారా అమ్మవారికి కానుకలు సమర్పించి ఈ ముఖమండపాన్ని నిర్మించుకున్నారని అన్నారు. ఈ రోజు అమ్మవారి దర్శించుకోవడానికి గ్రామంలోని వారి కుటుంబసభ్యులతో పాటు వారి బంధువులు, స్నేహితులు కూడా భారీ సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. అంకమ్మ తల్లి దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారు మా చేత ఈ గుడి నిర్మాణం నుండి అభివృద్ధివరకు మాచేత చేయించుకుంటుందని ఇది మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఈ గుడి గురించి అందరికీ తెలిసే విధంగా మరింత అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. భక్తులు అమ్మవారికి అన్నం పూర్ణకుంభం కార్యక్రమంలో పాల్గొని, భక్తితో సారె, పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు సమర్పించుకున్నారు. భక్తులు తీర్థప్రసాదాల అనంతరం జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *