Breaking News

క్షేత్ర స్థాయిలో పర్యటించే బృందాలపై కీలక బాధ్యతలు

-మార్గదర్శకాలు పై అవగాహన కల్పించాలి
-సువిదా ద్వారా ఇచ్చే అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి
– ఆర్వో తేజ్ భరత్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మోడల్ ప్రవర్తనా నియమావళి మరియు సువిధ ఆప్, ఫ్లైయింగ్ స్వాడ్స్ , స్టాటిస్టికల్ సర్వైవల్ స్క్వాడ్స్ , వీడియో సర్వైవల్ బృందాల నోడల్ అధికారులు, సిబ్బంది ఎంతో జవాబుదారీ తనంతో కూడిన విధి నిర్వహణ నిర్వహించాల్సి ఉంటుందని రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం సంబంధించి ఎంసిసి , తదితర బృందాల అధికారుల
సిబ్బందికి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి పునశ్చరణ లో భాగంగా విధి నిర్వహణ నిర్వహించాల్సి విధులు బాధ్యతలు పై సమీక్ష  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా రూరల్ ఆర్వో, జేసి ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ , రానున్న సార్వత్రిక ఎన్నికలని సజావుగా నిర్వహించే క్రమంలో ఎమ్ సి సి, ఎఫ్ ఏస్ టి, ఏస్ ఏస్ టి , వి ఎస్ టి బృందాలపై ఎంతో గురుతారమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వార సువిధ ఆప్ నందు వివిధ సభలు సమావేశాలు, ప్రచారం, ప్రచురణలు కోసం అనుమతులు నిష్పక్షపాతంగా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయలన్నారు. 48 గంటల ముందుగా అనుమతి తప్పని సరి అన్నారు. అనుమతి లేకుండా ప్రచారాలు జరగుతున్న వాటి పై చర్యలు తీసు కోవాల్సి ఉంటుందనీ , క్షేత్ర స్థాయిలో పర్యటించే బృందాలు తనిఖీలు నిర్వహించి ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పలు సూచనలను జారీ చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్, సహాయ రిటర్నింగ్ అధికారి వై. కె. వి.అప్పారావు , ఎంపీ డివో డి. శ్రీనివాస రావు, మోటార్ వెహికలే ఇన్స్పెక్టర్, పంచాయతీ రాజ్, బొమ్మూరు సి ఐ , ఇతర అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *