Breaking News

సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచనున్నట్లు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయా ఈ వి ఎమ్ యూనిట్స్ ను స్ట్రాంగ్ రూమ్ లలో పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా భద్రపరచనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ సందర్శించి, తగిన జాగ్రత్తలు తెలియ చేశారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఈ వి ఎమ్ గోడౌన్ నుంచి సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఈ వి ఎమ్ యూనిట్స్ ను అసెంబ్లి నియోజక వర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు చెయ్యడం జరిగిందన్నారు. ఏప్రియల్ 12 న పార్లమెంటు నియోజక వర్గాలకు చెందిన, ఏప్రియల్ 13 అసెంబ్లి నియోజక వర్గాల కు ఈవిఎమ్ యూనిట్ ( బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్స్) అత్యంత భధ్రత మధ్య పోలింగ్ కోసం పంపడం జరిగిందనీ అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు తిరిగి ఆయా యూనిట్స్ సురక్షితంగా ఈ వి ఎమ్ గోడౌన్ తరలిస్తామని తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లి సిగ్మెంట్ వారీగా వాటికి కేటాయించినా గదుల్లో భద్ర పరుచుటకు ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అనుగుణంగా పార్టీషియన్ పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఈవిఎమ్ నోడల్ అధికారి, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి , ఆర్ అండ్ బి జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్బీవీ రెడ్డి, డి ఈ బీబీవి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *