– పెండింగ్ పనుల పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి
– కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణ ను దృష్టిలో ఉంచుకొని రాజమహేంద్రవరం నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన గ్రీనరీ అభివృద్ది ని చేసే విధంగా జాతీయ రహదారుల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులతో కలెక్టర్ పి. ప్రశాంతి రహదారుల అభివృద్ధి పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి . ప్రశాంతి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో జాతీయ రహదారులు ఎన్.హెచ్-16, ఎన్.హెచ్-216 ప్రారంభం నుండి చివరి వరకు రహదారులు ఇరువైపులా ఆహ్లాదాన్ని కలిగించే పచ్చదనంతో కూడిన గ్రీనరీలను ఏర్పాటు చేసి అభివృద్ది చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులను ప్రజలకు తెలియ జేసే విధంగా బోర్డులు పెట్టాలని సూచించారు. భూ సేకరణ పెండింగ్ లేకుండా తీసుకోవాలని అన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ఆగస్టు చివరి నాటికి వంతెన ట్రాఫిక్ కు అనుమతించే విధంగా సిద్ధం చేయనున్నట్లు వివరించారు. రాజానగరం ప్రాంతం లో ఏ డీ బి రోడ్డు కు చెందినా పనుల పురోగతి పై వివరాలు తెలియ చేసారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ డి. సురేంద్రనాథ్ వివరిస్తూ జాతీయ రహదారులకు సంబంధించి లాలాచెరువు, ఐటీసీ జంక్షన్ బొమ్మూరు, వేమగిరి లలో ఫ్లైఓవర్ నిర్మాణం, సర్వీస్ రోడ్స్, లైటింగ్ సంబంధించి రూ.345 కోట్లు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా గామన్ జంక్షన్ దివాన్ చెరువు వరకు 2.4 కి.మీ. ఫ్లై ఓవర్ నిర్మాణం కొరకు రూ.141 కోట్లు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించగా, ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలో టెండర్లు ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశం లో సబ్ కలెక్టరు అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్ అండ్ బి జిల్లా రోడ్డు రహదారుల అధికారి ఎస్ బి వి రెడ్డి, జాతీయ రహదారుల ఆధారటి ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. సురేంద్రబాబు, ఆర్డీబీ ఈ ఈ శ్రీకాంత్, తదితరులు హాజరయ్యారు.