Breaking News

ఓరియే స్ట్సషన్ సెషన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అండర్ ట్రయిల్ ముద్దాయి ల రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం లో ఓరియే స్ట్సషన్ సెషన్స్ ను కార్యదర్శి నిర్వహించారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం అండర్ ట్రయిల్ ముద్దాయి ల రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం లో ఓరియే స్ట్సషన్ సెషన్స్ ను కార్యదర్శి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళ కారాగారాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ నియమించిన జైలు పారా లీగల్ వాలంటీర్ల మరియు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులుతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అని, ఖైదీల తరపున వాదించేందుకు న్యాయవాది లేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. జైలు పారా లీగల్ వాలంటీర్ల కు తెలియజేశారు, వారికి ఎలాంటి న్యాయ సమస్యలున్నా జైలు పారా లీగల్ వాలంటీర్ల ద్వారా కానీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా కానీ సంస్థకు తెలియ జేయాలని అన్నారు. ఈ సందర్భంగా కొత్త చట్టలు గురించి జైలు అధికార్లుకు మరియు జైలు సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ , ప్రత్యేక మహిళ జైలు సూపరింటెండెంట్ సిహెచ్. వసంత కుమారి , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు జే.మహేష్ , పి ఎం జె ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *