Breaking News

రాజమండ్రికి మంత్రి సత్య కుమార్ యాదవ్ రాక…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జూలై 8వ తేదీ సోమవారం హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 7:40 రాజమండ్రీ (మధురపూడి) విమానాశ్రయం కు చేరుకుంటారు. అక్కడినుండి ఉదయం 7:50 కి బయలుదేరి అనపర్తికి ఉదయం 8.50 చేరుకుంటారు. అనపర్తి గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 9:40 వరకు 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధు లతో కలిసి పాల్గొంటారు. అక్కడనుండి బయలుదేరి ఉదయం 10:30 కు రాజమహేంద్రవరం చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో సాయంత్రం 6 గంటల వరకు పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి బయలుదేరి విజయవాడకు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు.

Check Also

గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులను పట్టణ ప్రణాళికాధికారులతో కలిసి పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ మీడియా సంస్థల కధనాలు, ఫిర్యాదులపై గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *