-ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్ కేవీ సత్యవతి అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ కేవీ సత్యవతి 15 ఫైనాన్స్ కమిషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అందులో భాగంగా హెచ్ బి కాలనీ, కబేల, ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెచ్ బి కాలనీలో అభివృద్ధి చెందిన పార్కులను పరిశీలించారు, వాకింగ్ ట్రాక్ క్రికెట్ ప్రాక్టీస్ టెన్నిస్ కోడ్ ఇరిగేషన్ సిస్టం మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై పరిశీలించడమే కాకుండా పార్క్ ని త్వరగా ప్రారంభానికి సిద్ధం చేసేటు పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి కబేలా సందర్శించి అక్కడ జరుగుతున్న పాతవే, ఫెన్సింగ్, బ్లాక్ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. కబేలా లో ఆలాధకరమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టిన ఈ పనులను త్వరతీగాతినా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. తదుపరి hb కాలనీలో ఉన్న రోజ్ గార్డెన్ పార్క్ ను సందర్శించారు అక్కడ జరుగుతున్న స్కేటింగ్ రింగ్ గ్రీనరీ పనులను పరిశీలించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు త్వరితగతిన పనులను పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.