Breaking News

ఈనెల 19న మాజీ సైనికుల మహాసభ : మోటూరి శంకర్‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీసైనికులకు సమస్యల పరిష్కరానికి ఈనెల 19న ఉదయం పదిగంటలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మంగళగిరి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌నందు రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని జిల్లాలలో, నియోజకవర్గాలలోని మాజీ సైనికులకు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర మాజీ సైనిక సంఘం ఏపీ స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు పిలుపునిచ్చారు. మాజీసైనికుల సమస్యల పరిష్కారం మాజీ సైనికుల కార్పొరేషన్‌, మాజీ సైనికుల గృహవసతి, మరియు ప్రభుత్వ జిఓల అమలు తదితర సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళటకు రాష్ట్ర మాజీ సైనిక సంఘం ఏపీ స్టేట్‌ మాజీ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు అధ్యక్షతన ప్రముఖ టీడీపీ నాయకులు తొండెపుదశరథ జనార్ధన సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడిని ప్రత్యేక ముఖ్య అతిధిగా ఆహ్వానించే ఈ కార్యక్రమానికి మాజీసైనికుల అందరూ హాజరు కావాలి అని కోరారు. మాజీసైనికుల అందరూ ప్రతీ నియోజకవర్గమునుండి పేర్లు ఇచ్చినవారు అందరు మరియు అన్ని కమిటీల సభ్యులు భారీ సంఖ్యలో హాజరై మాజీ సైనికుల మహాసభను జయప్రదం చేయాలని కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *