-నిరంతరం త్రాగునీటి పరీక్షలు చేస్తూ ఉండండి- అధికారులకు ఆదేశాలు
-నిర్ణీత సమయంలోనే త్రాగునీటిని పట్టుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేసిన ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం సర్కిల్ 2, సర్కిల్ 3 పరిధిలో ఉన్న జింఖానా గ్రౌండ్స్, గాంధీనగర్, బి ఆర్ టి ఎస్ రోడ్, శారదా కాలేజ్, గురునానక్ కాలనీ, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.
రోడ్లపై ఉన్న వర్షపు నీటి నిలువలను చూసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం ఎయిర్ టేక్ మిషిన్స్ తో వాటిని శుభ్రపరచడమే కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వర్షం పడిన వెంటనే అప్రమత్తంగా ఉండి వర్షపు నీటి నిలువలను రోడ్లమీద నుండి వెంటనే తొలగించాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు సైడ్ డ్రైనలలో వర్షపు నీటి ప్రవాహనికి ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లిపోయేటట్టు చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ సిబ్బంది సంయుక్తంగా ఈ సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరించుకుంటూ ఒకరితో ఒకరు సమన్వయంతో పనులను పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
తన పర్యటనలో సీతారాంపురం సిగ్నల్ రోడ్డు, గురు నానక్ కాలనీ రోడ్డు లో పొంగుతున్న మురుగును చూసి వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతిరోజు త్రాగునీటి నమూనాలను సేకరించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ త్రాగునీటి సరఫరాలో సురక్షితమైన త్రాగునీటినే సరఫరా చేసేటట్టు చూసుకోవాలని అన్నారు.
అంతేకాకుండా ప్రజలు కూడా కేవలం విజయవాడ నగరపాలక సంస్థ నీటి సరఫరా ను విడుదల చేస్తున్న నిర్ణిత సమయంలోనే పట్టుకోవాలని, కార్పొరేషన్ త్రాగునీటి సరఫరా చేయని సమయంలో మోటారు ద్వారా నీరుని పట్టుకుంటే బురద నీళ్లు, రంగు మారిన నీరు వస్తుంది కాబట్టి, కార్పొరేషన్ నిర్ణీత సమయంలోనే నీటి సరఫరా చేస్తుంది కాబట్టి కేవలం ఆ సమయంలోనే ప్రజలను త్రాగునీరు పట్టుకోవాల్సిందిగా ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ విజ్ఞప్తి చేశారు.